Breaking News

ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్‌


Published on: 13 May 2025 15:18  IST

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తీసుకొస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి మూడురోజుల క్రితం సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు.నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి