Breaking News

శ్వేతసౌధంలో విందు ట్రంప్‌ది.. బిల్లు మునీర్‌ది..!


Published on: 19 Jun 2025 12:46  IST

ఇటీవల ఫీల్డ్‌ మార్షల్‌ అసిం మునీర్‌ మాట్లాడుతూ భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్‌ నోబెల్‌ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది. అసీం మునీర్‌కు విందు ఇవ్వడం వెనక చాలా కారణాలున్నాయి. అమెరికా నేడో, రేపో ఇరాన్‌పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పాత మిత్రుడు పాక్‌తో అగ్రరాజ్యానికి అవసరం పడింది.

Follow us on , &

ఇవీ చదవండి