Breaking News

కాచిగూడ, కాజీపేట మీదుగా రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లు..!


Published on: 19 Jun 2025 18:56  IST

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్‌-యోగ్‌ నగరి రిషికేశ్‌ (06597)కు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రైలు గురువారం ఉదయం 7గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి