Breaking News

చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం


Published on: 19 Jun 2025 18:37  IST

హైదరాబాద్‌ నగరాన్ని స్వచ్చ సర్వేక్షన్‌లో అగ్రభాగంలో నిలిపేలా పనిచేయాలంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం శానిటేషన్‌ విభాగం సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ డివిజన్‌ ఫిలింనగర్ ప‌రిధిలోని పలు బస్తీల్లో చెత్త తరలింపులో జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుకున్న కార్పొరేటర్‌ వెల్దండ వెంకటేష్‌ గురువారం పర్యటించారు.

Follow us on , &

ఇవీ చదవండి