Breaking News

తిరుమలలో భక్తులు రద్దీ..దర్శనానికి 20 గంటలు


Published on: 19 Jun 2025 18:59  IST

గత నెల రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతూనే ఉంది. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో.. కొండపై ఉన్న అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు.దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే బుధవారం స్వామివారిని రికార్డు స్థాయిలో 80,440 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి