Breaking News

విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు..


Published on: 19 Jun 2025 16:15  IST

విశాఖపట్నం సముద్ర తీరంలో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖపట్నం వేదికగా ఈ కార్యక్రమం భారీ ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం తీరంలో జూన్ 20, 21వ తేదీల్లో అంటే.. శుక్రవారం, శనివారం చేపల వేటపై ఆంక్షలు విధించారు.

Follow us on , &

ఇవీ చదవండి