Breaking News

ఆధార్‌ ఉంటేనే తత్కాల్ టికెట్‌..


Published on: 19 Jun 2025 16:41  IST

తత్కాల్ టికెట్‌ బుకింగ్‌కు సంబంధించి జులై 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో ఆధార్‌ అథంటికేషన్‌, కేవైసీ పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే వీలుంది. అంతేకాదు జులై 15 నుంచి టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆధార్‌ ఓటీపీ కూడా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్టవేసి నిజమైన ప్రయాణికులకు టికెట్లు దక్కేలా చూడడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి