Breaking News

వైజాగ్‌కు మరో ఐటీ దిగ్గజ కంపెనీ..!


Published on: 19 Jun 2025 17:02  IST

విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖను తన తదుపరి గమ్యంగా ఎంచుకుంది. విశాఖలో ఐటీ హబ్‌ను మరింత బలోపేతం చేయడానికి కాగ్నిజెంట్ సంస్థ రూ. 1500 కోట్ల పెట్టుబడితో ఒక మెగా టెక్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 8000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. ఇది విశాఖ ఐటీ రంగానికి తిరుగులేని బలం కలిగించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి