Breaking News

పాశమైలారంలో పేలిన రియాక్టర్‌..12కి చేరిన మృతులు


Published on: 30 Jun 2025 15:43  IST

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. మరో 30 మందికిపైగా గాయాలయ్యాయి. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి