Breaking News

సిగాచి ప్రమాద స్థలికి హైలెవల్ కమిటీ


Published on: 04 Jul 2025 13:00  IST

పాశమైలారంలోని సిగాచి ప్రమాద ఘటనా స్థలికి సీఎస్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ చేరుకుంది. ప్రమాద స్థలిని హైలెవల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీకి చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన తర్వాత బాధిత కుటుంబాలతో కమిటీ మాట్లాడనుంది. సిగాచి యాజమాన్యంతో కూడా మాట్లాడి వివరాలను సేకరించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి