Breaking News

అమ్మో పులి.. వణికిపోతున్న జనం..


Published on: 04 Jul 2025 15:20  IST

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. గడచిన నాలుగు రోజుల క్రితం నుంచి వీరన్నపేట సక్కని రాయి గుట్టపై చిరుత సంచరిస్తోంది. నివాస ప్రాంతాలకు సమీపంలోనే చిరుత సంచరించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది గుట్టపైకి వెళ్ళి చిరుత సంచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. చిరుత జాడ కోసం అన్వేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి