Breaking News

కొమ్మాలలో స్వచ్ఛ‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ పరిశీలన


Published on: 17 Jul 2025 18:40  IST

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మాలలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌ కార్యక్రమాన్ని కేంద్ర పరిశీలకుడు సాయి గురువారం పరిశీలించారు. గ్రామంలో చేప‌ట్టిన పారిశుధ్య పనులను, మరుగుదొడ్ల నిర్వహణ, ఇంకుడు గుంతలు, మురుగునీటి నిర్వహణ, తడి పొడి చెత్త నిర్వహణ, వ్యక్తిగత పరిసరాలు, పరిశుభ్రత పాటించ‌డం వంటి అంశాల‌ను ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో తిరుగుతూ ప‌రిశీలించారు.అనంతరం రిజిస్టర్ రికార్డుల‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి