Breaking News

ఏలూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు


Published on: 01 Dec 2025 11:11  IST

ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన హెలికాఫ్టర్‌లో ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోపినాథపట్నం వెళ్తారు. స్థానికంగా నివసిస్తున్న నాగలక్ష్మీ ఇంటికి వెళ్లి ఆమెకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ అందించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి