Breaking News

రాష్ట్ర కళాకారులు ముగ్గురికి జాతీయ అవార్డులు


Published on: 10 Dec 2025 11:59  IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురికి జాతీయ హస్తకళల అవార్డులు దక్కాయి. మంగళవారం, విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023, 2024కు గానూ జాతీయ హస్తకళల అవార్డులను ప్రదానం చేశారు. 2023కు గానూ శిల్ప గురు అవార్డును డి.శివమ్మ అందుకున్నారు. ఈమె శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన వారు. తోలుపై రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ లీలలను ఆమె అద్భుతంగా చిత్రీకరించారు.

Follow us on , &

ఇవీ చదవండి