Breaking News

2 ఏళ్లలో 118.78 కోట్ల మంది..


Published on: 10 Dec 2025 12:04  IST

మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)తో సిటీ బస్సుల్లో 24 నెలల్లో 118.78 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు సాగించారు. 2023 డిసెంబరు 9న ఈ పథకం ప్రారంభించగా, ఈ ఏడాది 8 వరకు గ్రేటర్‌జోన్‌లో 118.78 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సేవలు వినియోగించుకున్నారు. టికెట్‌ చార్జీల రుసుం రూ.2,757 కోట్ల వరకు ఉండగా వాటిని ప్రభుత్వం దశల వారీగా ఆర్టీసీకి చెల్లిస్తోంది.బస్సుల్లో రోజూ 16 లక్షల 18 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు సాగిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి