Breaking News

కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు


Published on: 10 Dec 2025 15:11  IST

సూర్యాపేటజిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి నిదర్శనం.

Follow us on , &

ఇవీ చదవండి