Breaking News

ఓయూకు గుడ్ న్యూస్..రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం


Published on: 10 Dec 2025 17:28  IST

ఉస్మానియా వర్సిటీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(బుధవారం) సందర్శించారు.ఈ సందర్భంగా ఓయూకు రూ.1000కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు.ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేశారు.అలాగే, ఓయూ అభివృద్ధికి రూ.45 లక్షల చెక్కు అందజేశారు పూర్వ విద్యార్థులు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర ‘సర్వం సిద్ధం’ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు .స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా ఉస్మానియా యూనివర్సిటీ వినిపించిందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి