Breaking News

ఈసారి SGT టీచర్లకు కలిసొచ్చిన టెట్‌ పరీక్ష..


Published on: 23 Jul 2025 16:53  IST

తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 18 నుంచి 30 మధ్య ఆన్‌లైన్‌ టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జులై 22న విడుదలైనాయి. తాజా ఫలితాల్లో మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయాగా.. రెండు పేపర్లకు కలిపి 59,692 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే 43.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నమాట. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా కొనసాగుతున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీలు)లో ఈసారి టెట్‌ పరీక్షలో దాదాపు సగం మంది ఉత్తీర్ణత సాధించారు.

Follow us on , &

ఇవీ చదవండి