Breaking News

హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..


Published on: 14 May 2025 17:02  IST

హైదరాబాద్ నల్లచెరువు సుందరీకరణ పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా చేస్తున్న పనులతోనే వరదనీరు ఇళ్లలోకి చేరుకుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు అన్నారు. కూకట్‌పల్లి ఇన్‌చార్జ్‌ మాధవరం కాంతారావుతో కలిసి నల్లచెరువుకు అనుకుని ఉన్న కాలనీల్లో పర్యటించారు. అకాల వర్షంతో ఇళ్లలోకి నీరు చేరుకుందని కాలనీవాసులు తమ గొడు వెళ్లబోసుకున్నారు. హైడ్రా అధికారుల తీరుతోనే ఇళ్లలోకి నీరు చేరుతుందన్నారు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు.

Follow us on , &

ఇవీ చదవండి