Breaking News

టీటీడీ ట్రస్టులకు రూ.1.40 కోట్ల వితరణ


Published on: 16 May 2025 11:58  IST

టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం రూ.1.40 కోట్లు విరాళంగా అందాయి. అమెరికాలోని బోస్టన్‌లో నివాసముంటున్న భాగవతుల ఆనంద్‌ మోహన్‌ ఈ విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీలను తిరుమలలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు అందజేశారు. రూ.కోటి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, వేదపరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, సర్వశ్రేయాస్‌ ట్రస్టుకు రూ.10 లక్షల చొప్పున వినియోగించాలని దాత కోరారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్‌ అభినందించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement