Breaking News

ఢిల్లీకి మంత్రి నారా లోకేష్‌.. రేపు ప్రధాని మోడీతో భేటీ


Published on: 16 May 2025 16:32  IST

ఏపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు మంత్రి లోకేష్.. రేపు సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గతంలో రెండు సందర్భాల్లో మంత్రి నారా లోకేష్ ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు ప్రధాని మోడీ.. దీంతో, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ అడిగారట లోకేష్.. ఇక, ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో.. హస్తినబాట పట్టనున్నారు..

Follow us on , &

ఇవీ చదవండి