Breaking News

కేసీఆర్‌కు నోటీసుల వెనక ఉంది వారే.. కేటీఆర్ ఫైర్


Published on: 21 May 2025 15:42  IST

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపించారు.గత 17 నెలలుగా పాలన చేతకాక,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి