Breaking News

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ


Published on: 22 May 2025 15:41  IST

రాష్ట్రంలో ఏనుగుల గుంపులను తరిమికొట్టి, రైతుల బాధలను తీర్చేందుకు కుంకీ ఏనుగులను ఇవ్వాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు కర్ణాటక ప్రభుత్వం నాలుగు కుంకీ ఏనుగులను ఏపీ అప్పగించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి కుంకీ ఏనుగులు రావడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అభినందలు తెలియజేశారు. అలాగే అవసరమైతే మరిన్ని కుంకీ ఏనుగులు ఇచ్చేందుకు హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి