Breaking News

మదన్‌లాల్‌ మృతిపట్ల కేసీఆర్, కేటీఆర్‌ సంతాపం


Published on: 27 May 2025 12:26  IST

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌ మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. మదన్‌లాల్‌ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మదన్‌లాల్‌ మృతిపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. మదన్‌లాల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి