Breaking News

ఎన్టీఆర్ జయంతికీ నివాళులర్పించారు మోదీ


Published on: 28 May 2025 11:44  IST

తెలుగు సినిమాల్లో హీరోగా, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు దివంగత నందమూరి తారకరామారావు. నేడు (మే 28న) ఆయన 102వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినిమా, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు, ప్రజా సేవలో ఆయన చూపిన దార్శనికత, నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మోదీ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి