Breaking News

గచ్చిబౌలిలో కారులో మంటలు


Published on: 03 Jun 2025 13:39  IST

గచ్చిబౌలిలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుగా ఈ ఘటన జరిగింది. కారు రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి