Breaking News

ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు


Published on: 03 Jun 2025 13:47  IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఎల్లారెడ్డి మండలం, సోమార్ పేట్‌లో క్రికెట్ ఆడటానికి ఎల్లారెడ్డికి చెందిన యువకులు వెళ్లారు. క్రికెట్ ఆడిన తర్వాత నిజాంసాగర్ నీటిలో స్నానం చేయడానికి స్నేహితులు వెళ్లారు. బ్యాక్‌వాటర్‌లో మునిగి ముగ్గురు యువకులు (మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్) గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిజాంసాగర్ వద్దకు చేరుకుని రాత్రి నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి