Breaking News

జీబీ లింక్‌తో తెలంగాణ జల హక్కులకు తీరని ముప్పు


Published on: 03 Jun 2025 14:28  IST

ఏపీ సీఎం పోలవరం-బనకచర్ల జీబీ లింక్‌ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, లాభ నష్టాలను వివరించారు. కానీ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర ముప్పు ఏర్పడనున్నది. బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు విరుద్ధంగా, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపడుతున్నదని, తద్వారా తెలంగాణ జలహక్కులకు తీరని నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఏపీకి కేంద్రం మద్దతు ఇస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి