Breaking News

భారత్‌లో అధికార భాషపై కనిమొళి ఏమన్నారంటే..


Published on: 03 Jun 2025 15:51  IST

ఆపరేషన్ సిందూర్ ని వివరించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని ప్రతినిధుల బృందం స్పెయిన్‌లో పర్యటిస్తోంది. భారతదేశంలో అధికార భాషపై అడిగిన ఒక ప్రశ్నకు తూత్తుకుడి ఎంపీ కనిమొళి సమాధానమిస్తూ, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ జాతీయ భాష అని చెప్పారు. ఈ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు తమ ప్రతినిధుల బృందం వచ్చిందన్నారు. ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం ఇవాళ చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని కనిమొళి చెబుతున్నప్పుడు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి