Breaking News

డ్రగ్స్‌ కేసు..కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు


Published on: 04 Jun 2025 16:43  IST

కూకట్‌పల్లి డ్రగ్స్ కేసులో (Drugs Case) దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న కానిస్టేబుల్ గుణశేఖర్‌‌తో పాటు మిగిలిన నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. గుణశేఖర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈజీ మని కోసం డ్రగ్స్ దందాలో దిగినట్లు పోలీసులు గుర్తించారు.గుణశేఖర్‌ను అరెస్ట్ చేస్తే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి