Breaking News

బాబు శిష్యుల కోసం.. రైత్నన్నలపై సర్కార్ దౌర్జన్యం


Published on: 05 Jun 2025 12:42  IST

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ 12 గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడికి అధికార పార్టీ నేతలు అండగా నిలవడం ప్రజల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. ఆయనకు చెందిన ఫ్యాక్టరీపై రైతులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం పలాయనం చిత్తగించింది. పోలీసులు మాత్రం సాయంత్రం గ్రామాల మీద విరుచుకుపడి, దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి