Breaking News

ఢిల్లీలోని సాకేత్ కోర్టు లాకప్‌లో ఒక ఖైదీ మృతి


Published on: 05 Jun 2025 15:48  IST

ఢిల్లీలోని సాకేత్ కోర్టు లోపల లాకప్‌లో ఖైదీ హత్యతో తీవ్ర కలకలం రేగింది. సాకేత్ కోర్టు లాకప్ లోపల అమన్ అనే ఖైదీని మరో ఇద్దరు ఖైదీలు హత్య చేశారు. ఇద్దరు నిందితులను తీహార్ జైలు నంబర్ 8లో ఉంచారు.విచారణ కోసం సాకేత్ కోర్టుకు తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు జితేందర్ ,జైదేవ్ మృతుడు అమన్ పై దాడి చేశారు. జితేందర్ ,అమన్ మధ్య పాత శత్రుత్వం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి