Breaking News

HDFC బ్యాంక్‌‌‌‌ సీఈఓ జగదీశన్‌‌‌‌పై చీటింగ్ కేసు..


Published on: 09 Jun 2025 14:29  IST

లీలావతి హాస్పిటల్‌‌‌‌ను నడిపే లీలావతి కిర్తీలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్ట్) హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆయన్ని వెంటనే సస్పెండ్ చేసి, విచారించాలని డిమాండ్ చేసింది. ట్రస్ట్‌‌‌‌లో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్‌‌‌‌లో జగదీశన్ హస్తం ఉందని పేర్కొంది. ఈ ఆరోపణలను హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ స్పోక్స్‌‌‌‌పర్సన్ ఖండించారు. ట్రస్ట్, దాని ట్రస్టీలు, ఆఫీసర్స్ నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తోసిపుచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి