Breaking News

జూన్‌ 12 నుంచే బడుల్లో ‘విద్యార్ధి మిత్ర కిట్ల’ పంపిణీ..


Published on: 10 Jun 2025 12:11  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం జూన్ 12న బడులు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీ చేసేందుకు కూటమి సర్కార్‌ ఏర్పాట్లు చేస్తుంది. జూన్‌ 20లోపు పంపిణీ పూర్తి చేయాలని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించింది. ఈ కిట్‌లో ఒక్కో విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనీఫాం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్‌ అందించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి