Breaking News

ఇరాన్‌లో భారతీయ విద్యార్థుల ఆందోళన


Published on: 16 Jun 2025 14:15  IST

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో ఇరాన్‌ దద్దరిల్లుతోంది. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో నిరంతరం అట్టుడుకుతోంది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వైద్యులుగా మారేందుకు ఇక్కడికి వచ్చాం. కానీ, ఇప్పుడు ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి