Breaking News

నదిలో కుప్పకూలిన వంతెన! నలుగురు మృతి..


Published on: 16 Jun 2025 14:25  IST

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాణి నదిపై ఉన్న పురాతన వంతెన ఆదివారం (జూన్‌ 15) కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన పాత కట్టడం. ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి కుండ్మాల గ్రామం సమీపంలోని నదిపైన ఉన్న కట్టడం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి