Breaking News

ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్‌ దాడులు..


Published on: 16 Jun 2025 18:25  IST

గాజా లో ఇజ్రాయెల్‌ మారణహోమాన్ని సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. తాజాగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో కనీసం 38 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పలువురు గాయపడినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది.

Follow us on , &

ఇవీ చదవండి