Breaking News

సునీల్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు


Published on: 23 Jun 2025 11:32  IST

వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేక హత్యకేసు లో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ ఫిర్యాదు కేసుకు సంబంధించి పులివెందుల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సునీల్ కుమార్ తన కుటుంబంతో కలిసి కారులో వెళుతుండగా కొందరు యువకులు వెంబడించి దాడికి యత్నించారంటూ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, విచారించిన అనంతరం పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి