Breaking News

కమలం కొత్త సారథి రాంచందర్‌రావు


Published on: 30 Jun 2025 10:37  IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్షపీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.దీంతో మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి