Breaking News

నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి భారత నేవీ


Published on: 30 Jun 2025 12:10  IST

భారత్‌ నుంచి ఒమన్‌కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈమేరకు సమాచారం అందుకున్న వెంటనే భారత నౌకాదళ (Indian Navy) సిబ్బంది రంగంలోకి దిగారు. బోట్లు, హెలికాప్టర్‌ సాయంతో హుటాహుటిన నౌక వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన నౌకలో భారత సంతతికి చెందిన 14 మంది సిబ్బంది ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. మంటలు చాలావరకు నియంత్రణలోకి వచ్చాయి’’ అని భారత నౌకాదళం ట్వీట్‌ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి