Breaking News

బ్యాంకు గోడకు కన్నమేసి.. వెల్దుర్తిలో చోరీకి యత్నం


Published on: 30 Jun 2025 12:34  IST

మెదక్‌ జిల్లా వెల్దుర్తిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో దుండగులు చోరీకి యత్నించారు. సోమవారం తెల్లవారుజామున బ్యాంకు గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. స్టోర్‌ రూమ్‌ వెనుక నుంచి తాళాలు పగులగొట్టారు. ఈక్రమంలో లాకర్స్‌ రూమ్‌ దగ్గరికి వెళ్లగానే అలారం మోగింది. దీంతో వారు పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి