Breaking News

కారణం తెలియాల్సిందే..అధికారులకు సీఎం ఆదేశం


Published on: 01 Jul 2025 11:45  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఈరోజు (మంగళవారం) ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి పాశమైలారం చేరుకున్నారు సీఎం. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం.. సిగాచి పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించారు. సిగాచి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తనకు తెలియాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి