Breaking News

స్మార్ట్‌ మీటర్లు, చార్జీల పెంపుపై ఉద్యమం


Published on: 01 Jul 2025 14:13  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు, అదానీ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని త్వరలోనే కార్యాచరణ రూ పొందించాలని సోమవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయించాయి. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయడు పి. ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ తదితరులు హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి