Breaking News

ఎయిర్‌ ఇండియా, బోయింగ్‌లపై న్యాయపోరాటం..


Published on: 01 Jul 2025 16:43  IST

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తాలూకు పరిహారాన్ని పెంచాలంటూ బాధిత కుటుంబాలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్‌కు చెందిన బాధిత కుటుంబాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పరిహారం పెంపు కోసం అక్కడి కోర్టుల్లోనే కేసు వేయనున్నారని సమాచారం. ఎయిర్ ఇండియాతో పాటు విమానాల తయారీ సంస్థ బోయింగ్‌పై కూడా కేసు వేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయసేవల సంస్థ ‘కీస్టోన్ లా’ను కూడా సంప్రదించినట్టు తెలిసింది. 

Follow us on , &

ఇవీ చదవండి