Breaking News

శుభాంశుకు హాయ్‌ చెప్పిన దిల్లీ వాసులు..!


Published on: 08 Jul 2025 11:57  IST

భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ మన వ్యోమగామి శుభాంశు శుక్లా ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌ పరిశోధనల్లో నిమగ్నమై ఉన్న ఆయనకు దిల్లీ ప్రజలు హాయ్‌ చెప్పారు. అదెలా అనుకుంటున్నారా..? కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే ఈ ఐఎస్‌ఎస్‌.. తాజాగా దేశ రాజధాని వాసులను కనువిందు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నిశీధిలో మిలమిలా మెరుస్తూ దిల్లీ గగనతలంపై కన్పించింది.

Follow us on , &

ఇవీ చదవండి