Breaking News

రేవంత్ ఇంటికైనా వెళ్తా.. కేటీఆర్


Published on: 08 Jul 2025 13:37  IST

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రైతులకు 9రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని.. రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, బీజేపీ దమ్ముంటే చర్చకు రావాలంటూ తొలుత సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సవాల్‌కు సిద్ధమని ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ ప్రతిసవాల్ విసిరారు. చెప్పినట్లుగానే కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వెళ్లారు. అయితే సీఎం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సీఎం ఢిల్లీలో ఉంటే మంత్రులైనా చర్చకు రావాలని కేటీఆర్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి