Breaking News

కల్తీ కల్లు వ్యవహారంపై మంత్రి జూపల్లి సీరియస్


Published on: 09 Jul 2025 15:54  IST

హైదరాబాద్‌ నగరంలో కలుషితమైన కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా బాధితుల్లో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపధ్యంలో చికిత్స పొందుతున్న కల్లు బాధితులని మంత్రి జూపల్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను నిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్ధితి నిలకడగా ఉందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి