Breaking News

హైదరాబాద్ పబ్‌లలో భారీగా డ్రగ్స్ దందా..


Published on: 09 Jul 2025 16:29  IST

భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు ఇవాళ(బుధవారం) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరొక డ్రగ్స్ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాకి ఈగల్ టీం అధికారులు వివరాలు వెల్లడించారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య నేతృత్వంలో డ్రగ్ సరఫరా జరుగుతున్నట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు. 23 మంది వ్యాపారవేత్తలకు సూర్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి