Breaking News

జిల్లాకో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి


Published on: 09 Jul 2025 16:38  IST

అర్బన్‌ జిల్లాగా ఉన్న హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలయింది. ప్రస్తుతం ఉన్న తొమ్మిది నవోదయ పాఠశాలకు అదనంగా మరో 23 పాఠశాలలు ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, రేణుక  ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

Follow us on , &

ఇవీ చదవండి