Breaking News

కల్తీకల్లు ఘటనలో నాలుగుకు చేరిన మృతులు..


Published on: 09 Jul 2025 18:52  IST

కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా.. బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన బాధితులు పలువురు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో నగేష్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, కుమార్‌, రమేశ్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి